byసూర్య | Thu, Nov 24, 2022, 08:49 AM
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం పరిధి పెద్ద శంకరంపేట మండలంలోని ఉత్తలూరు, రామోజీపల్లి, వీరోజిపల్లి గ్రామాల్లో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీపీ జంగం శ్రీనివాస్ బుధవారం పరిశీలించారు. పనుల్లో నాణ్యతను పెంచాలని ఆయన సూచించారు. ఆయా గ్రామాల సర్పంచులతో, ఎంపీటీసీ లతో, స్కూల్ హెచ్ఎం లతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రిఫికున్నిసా, మండల రైతు బంధు సురేష్ గౌడ్, ఎంపీటీసీ సుభాష్ గౌడ్, సర్పంచ్ లు శంకర్ గౌడ్, రవీందర్, కిషన్ సేట్, కార్యదర్శిలు, స్కూల్ చైర్మన్ లు, ఎంపీవో రియాజోద్దీన్, స్కూల్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.