byసూర్య | Thu, Nov 24, 2022, 08:48 AM
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలోని ఆయా గ్రామాల్లో వచ్చే వర్ష కాలంలో హరితహారం నిర్వహించేందుకు నర్సరీలను ఏర్పాటు చేయాలని మండల పంచాయతీ అధికారి వెంకట్రెడ్డి ఆదేశించారు. బుధవారం కోహీర్ ఎంపీపీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్ములు, ఈజీఎస్ ఎఫ్ఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యదర్శులు, ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు కలిసి హరితహారం నిర్వ హణపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలన్నారు. సమావేశంలో ఏపీవో సునం దరావు, కార్యదర్శులు, ఎఫ్ఏలు పాల్గొన్నారు.