byసూర్య | Thu, Nov 24, 2022, 08:45 AM
తల్లితండ్రులు మందలించారని పురుగుల మందు తాగి విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన ఘటన డిండి మండలం బ్రహ్మణపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై సురేష్ తెలిపిన వివరాల ప్రకారం బ్రహ్మనపల్లి గ్రామానికి చెందిన అఖిల(16) దేవరకొండలోని ప్రభుత్వ గర్ల్స్ హాస్టల్లో చదువుతోంది. నాలుగు రోజులక్రితం ఆరోగ్యం బాగాలేదని ఇంటికి వచ్చింది. మంగళవారం తిరిగి హాస్టల్ కు వెళితే పేరెంట్స్ ను తీసుకురావాలని టీచర్ చెప్పడంతో తిరిగి బ్రహ్మణపల్లికి వచ్చింది. ఈ క్రమంలోనే తల్లితండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైన అఖిల మంగళవారం రాత్రి పురుగుల మందు తాగింది. గమనించిన తల్లితండ్రులు హైదరాబాద్ లోని నవీన హాస్పటల్ కు తీసుకువెళ్ళగా బుధవారం తెల్లవారుజామున మరణించిoది. మృతురాలి తండ్రి లాలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.