byసూర్య | Wed, Nov 23, 2022, 10:21 PM
గ్రేటర్ హైదరాబాద్ విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. గ్రేటర్ హైదరాబాద్ బస్ పాస్ తోనే విద్యార్థులు పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ సర్వీసుల్లో ప్రయాణించేలా టీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులందరూ ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని టీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ సజ్జనార్ కోరారు.