![]() |
![]() |
byసూర్య | Wed, Nov 23, 2022, 08:01 PM
మల్లారెడ్డి విద్యాసంస్థల్లో భారీగా అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు ఐటీ వర్గాలు తెలిపాయి. నిర్ణీత రుసుము కంటే ఎక్కువ వసూలు చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఇప్పటి వరకు జరిపిన సోదాల్లో రూ.6 కోట్ల నగదు, బంగారం స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. స్థిరాస్తుల విలువ తక్కువగా ఉన్నట్లు ఆధారాలు సేకరించామన్నారు. అదనంగా వసూలు చేసిన ఫీజులను నగదు రూపంలో తీసుకుని ఖాతాల్లో చూపకుండా వ్యాపారంలో పెట్టుబడి పెట్టి మల్లారెడ్డి-నారాయణ ఆస్పత్రికి ఖర్చు చేసినట్లు గుర్తించారు.