అధికారులపై అసహన వ్యక్తం చేసిన మంత్రి మల్లారెడ్డి
byసూర్య |
Wed, Nov 23, 2022, 03:45 PM
తమ ఇంటిపై ఐటీ దాడులపై తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఐటీ రైడ్స్ పై స్పందిస్తూ, మేము దొంగ వ్యాపారాలు చేస్తున్నామా? స్మగ్లింగ్, క్యాసినోలు ఆడిస్తున్నామా? పేద పిల్లలకు చదువు అందిస్తున్నామన్నారు. రూ 35 వేలకు ఇంజనీరింగ్, ఎంబీఏ చదివిస్తున్నామని తెలిపారు. 200 మంది ఐటి అధికారులను తమ ఇంటి పైకి దౌర్జన్యం చేస్తున్నారని అగ్రహ వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్ష్యే అన్నారు. తన కొడుకుకి బాలేదని కనీసం చెప్పారా? టీవీలో చూసి నాకు విషయం తెలిసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.
Latest News