ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
byసూర్య |
Wed, Nov 23, 2022, 03:31 PM
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీఎల్ సంతోష్ కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు బుధవారం సిట్ కు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద ఈ-మెయిల్ ద్వారా నోటీసులు పంపాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టు బెంచ్ ముందుకు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు కాపీ వెళ్లింది. సుప్రీంకోర్టు ఆర్డర్ పై హైకోర్టు ధర్మాసనం ఇవాళ విచారణ జరిపింది. కేసుతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా నోటీసులు ఇస్తామని ఏజీ అన్నారు. ఇక ఈ కేసులో తాజాగా మరో ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది. నందకుమార్ భార్య చిత్రలేఖ, న్యాయవాది ప్రతాప్ గౌడ్ కు నోటీసులిచ్చింది.
Latest News