byసూర్య | Wed, Nov 23, 2022, 03:07 PM
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, వారి కష్టసుఖాలలో కేసీఆర్ అండగా నిలుస్తున్నారని షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్య యాదవ్ అన్నారు. ఆర్థిక సమస్యతో బాధపడే వారికి సీఎం సహాయ నిధి కొండంత భరోసాగా మారిందన్నారు. హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో శస్త్ర చికిత్స నిమిత్తం జిల్లేడ్ చౌదరి గూడ మండలకేంద్రానికి ఆలుగొండ రమేష్ కి సీ. ఎం సహాయనిధి ద్వారా 1 లక్ష 50 వేల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మంజూరు చేయించారు. బుధవారం లబ్ధిదారులకు స్థానిక టీఆర్ఎస్ నాయకుల సమక్షంలో ఎల్ఓసి పత్రాన్ని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ స్వయంగా అందజేసినట్లు ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు పేరుకొన్నారు.