పేద ప్రజల పెన్నిధి ముఖ్యమంత్రి కేసీఆర్: ఎమ్మెల్యే
byసూర్య |
Wed, Nov 23, 2022, 02:22 PM
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో మండలానికి చెందిన 51మంది లబ్దిదారులకు 51, 05, 916 రూపాయల విలువ చేసే కళ్యాణలక్ష్మి - షాదిముబారక్ చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో బుధవారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డలకు కొండంత భరోసా ఇస్తున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే సీఎం కేసీఆర్ ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ మండలానికి ఇప్పటివరకు14కోట్ల, 66లక్షల రూపాయల విలువ చేసిన కల్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను అందజేసాం అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Latest News