byసూర్య | Wed, Nov 23, 2022, 10:44 AM
తన ఇంటిపై ఐటీ అధికారులు దాడులపై మల్లారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము దొంగ వ్యాపారాలు చేస్తున్నామా? స్మగ్లింగ్ క్సాసినోలు ఆడిస్తున్నామా అంటూ మండిపడ్డారు. పేద పిల్లలకు చదువు అందిస్తున్నామని, 35వేలకే ఇంజనీరింగ్, ఎంబీఏ విద్యను అందిస్తున్నామని తెలిపారు. 200 మంది అధికారులను ఇళ్ల పైకి పంపి దౌర్జన్యం చేయడం రాజకీయ కక్షే అన్నారు. నా కొడుక్కు బాలేదని టీవీలో చూసేవరకు చెప్పరా అంటూ మండిపడ్డారు.