![]() |
![]() |
byసూర్య | Wed, Nov 23, 2022, 10:29 AM
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి, మంగళవారం రోజున కుటుంబ సమేతంగా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దర్శించుకున్నారు. అనంతరం యువజన కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వారి ఆధ్వర్యంలో ఘనంగా గజమాలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వెలిమినేటి సురేష్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బర్రె నరేష్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు యనగండ్ల సుధాకర్, మంగా కిరణ్, కర్రే అజయ్, అసెంబ్లీ అధ్యక్షుడు నందరాజ్, క్యసాగల్ల చందు, వీరమల్ల అభి, ఆలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.