byసూర్య | Wed, Nov 23, 2022, 10:11 AM
సంక్షేమ పథకాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ పేర్కొన్నారు. సంగారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం ఆయన లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. సంక్షేమ పథకాలతో పేదలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తున్నదన్నారు.