శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్ల మూసివేత
byసూర్య |
Tue, Oct 04, 2022, 03:58 PM
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరద గేట్లను మూసివేశారు. రెండు రోజుల క్రితం 7 గేట్లు, నిన్న 4 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేసిన అధికారులు వరద నీటి ఉధృతి తగ్గడంతో మంగళవారం మధ్యాహ్నం గేట్లను పూర్తిగా మూశారు. ఎగువ నుండి ప్రస్తుతం ప్రాజెక్టులోకి 15, 540 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. కాగా ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం పూర్తి స్థాయిలో 1091 అడుగులకు నీరు నిల్వ ఉంది.
Latest News