ఉరి వేసుకుని ఆత్మహత్య
byసూర్య |
Tue, Oct 04, 2022, 03:38 PM
నిర్మల్ రూరల్ మండలంలోని ఎల్ల పెల్లి గ్రామంలో మద్యానికి బానిసై ఓ వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని సోమవారం ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం. గ్రామానికి చెందిన గణపతి (56) అనే వ్యక్తి గత రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో తన వ్యవసాయ భూమి సమీపంలో మద్యం మత్తులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై పేర్కొన్నారు.
Latest News