byసూర్య | Mon, Oct 03, 2022, 01:57 PM
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం, దేవరకద్ర మండలం గోప్లపూర్ గ్రామానికి చెందిన వికలాంగుడు ఎద్దుల నాగన్నకు కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా స్కూటీ ని అందజేశారు. ఈ రోజు గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేని చూసి ఎద్దుల నాగన్న ఆప్యాయంగా పలకరించారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తనకు స్కూటీని అందజేయడంతో తన పనులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉందని తెలిపారు. గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్ కి మరియు తనకు స్కూటీ అందజేసిన ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.