ఎల్బీనగర్ ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతా: ఎమ్మెల్యే
byసూర్య |
Mon, Oct 03, 2022, 01:29 PM
ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో నెలకున్న మౌలిక సమస్యలన్నింటినీ ప్రాధాన్యతా క్రమంలో దశలవారీగా పరిష్కరించి ఇతర నియోజకవర్గాలకు ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. సోమవారం చంపాపేట డివిజన్ పరిధిలోని న్యూపద్మానగర్ కాలనీలో 25 లక్ష లతో తలపెట్టిన భూగర్భ డ్రైనేజీ, వరదనీటి కాలువ పనులకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్లా రఘుమారెడ్డి, ముడుపు రాజిరెడ్డి, చీర శ్రీనివాస్, గోపాల్ ముదిరాజ్, నిషికాంత్ రెడ్డి, జంగయ్య, శేఖర్ రెడ్డి , గోకుల సరోజా, రోజారెడ్డి పాల్గొన్నారు.
Latest News