byసూర్య | Mon, Oct 03, 2022, 01:23 PM
మహబూబ్ నగర్ మండలం అప్పాయపల్లి గ్రామంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నూతన ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి చెక్కులు, బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ప్రతి పల్లెకు కేసీఆర్ సంక్షేమ పథకాలు అందుతున్నాయని మంత్రి తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంఘం చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, జిల్లా బస్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు సత్యనారాయణ, జెడ్పీటీసీ వెంకటేశ్వరమ్మ, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ మల్లు నర్సింహారెడ్డి పాల్గొన్నారు.