మరో 30 రోజుల్లో మునుగోడు ఉపఎన్నిక
byసూర్య |
Mon, Oct 03, 2022, 01:07 PM
మునుగోడు ఉపఎన్నికకు ముహూర్తం ఖరారైంది. సరిగ్గా మరో 30 రోజుల్లో ఉపఎన్నిక జరగనుంది. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ నెల 7న నోటిఫికేషన్ రానుంది. ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరణ, 15న నామినేషన్ల పరిశీలన, ఈ నెల 17 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. మునుగోడు సహా 6 రాష్ట్రాల్లోని 7 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికల షెడ్యూల్ను ఈసీ సోమవారం ప్రకటించింది.
Latest News