మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే?
byసూర్య |
Mon, Oct 03, 2022, 12:41 PM
మునుగోడు ఉపఎన్నిక షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుండగా, నవంబర్ 6న ఫలితాలు రానున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Latest News