కెసిఆర్ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న UK ఎన్నారైలు

byసూర్య | Mon, Oct 03, 2022, 09:57 AM

KCR దేశ రాజకీయాల్లోకి రావాలని , వారి నూతన జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు యూకే ఎన్నారైలు తెలిపారు. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద సమావేశమైన ఎన్నారైలు కెసిఆర్ కి మద్దతుగా నినాదాలు చేశారు. యూకే లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు సైతం  కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి భారత దేశానికి నాయకత్వం వహించి దేశ గతిని మార్చాలని కోరారు. నేడు దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తుందని , రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు , జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరగాలంటే కెసిఆర్ వల్లే సాధ్యమని ఎన్నారైలు తెలిపారు. "దేశ్ కి నేత కెసిఆర్" అంటూ భారీ కెసిఆర్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 


Latest News
 

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Wed, Apr 24, 2024, 10:04 PM
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Wed, Apr 24, 2024, 09:59 PM
ఆమె మాటలు నమ్మి నట్టేట మునిగిన రిటైర్డ్ IAS.. రూ.1.89 కోట్లు హాంఫట్ Wed, Apr 24, 2024, 09:00 PM
మంచినీళ్లలా బీర్లు తాగేశారు.. ఆల్ టైం రికార్డ్, అమ్మో అన్ని కోట్ల బీర్లా Wed, Apr 24, 2024, 08:56 PM
చెప్పులతో పొట్టు పొట్టు కొట్టుకున్నరు..బస్సులో భార్యల సీట్ల కోసం భర్తల ఫైట్ Wed, Apr 24, 2024, 08:49 PM