byసూర్య | Sun, Oct 02, 2022, 04:06 PM
మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ చందనం చెరువు సమీపంలో గాంధీ జయంతి సందర్భంగా మహాత్ముడికి పూలమాలవేసి నివాళులు అర్పించి సరూర్ నగర్ , బాలాపూర్ ఆశా కార్యకర్తలకు ఆదివారం యూనిఫాం లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అర్చన, బాలాపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శారద, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రం రెడ్డి, ఫ్లోర్ లీడర్ భూపాల్ రెడ్డి , కార్పొరేటర్ సిద్దాల లావణ్య, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ అధ్యక్షులు కామేష్ రెడ్డి, బాలాపూర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పి. హెచ్. ఎన్ పద్మశ్రీ, కమలా కుమారి , సూపర్వైజర్ శ్రీనివాస్ ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.