byసూర్య | Fri, Sep 30, 2022, 01:55 PM
నేడు నారాయణపేట, ధన్వాడ మండలాల్లో పలు కార్యక్రమాలలో పాల్గొనాల్సిన సిఎంవో కార్యాలయ అధికారిణి స్మిత సబర్వాల్ పర్యటన రద్దు అయినట్లు పౌర సంబంధాల అధికారి సీతారాం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగ నేడు ధన్వాడ మండల కేంద్రంలో ఆరుణ్య చేనేత భవన్ ప్రారంభోత్సవం తోపాటు నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే బతులమ్మ వేడుకల్లో పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల పర్యటన రద్దు అయినట్లు వెల్లడించారు.