byసూర్య | Fri, Sep 30, 2022, 01:48 PM
సాగరహారానికి నేటితో పదేళ్లు పూర్తయ్యిందని మంత్రి కేటీఆర్ శుక్రవారం ట్వీట్ చేశారు. 'తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో పతాక స్థాయికి తీసుకెళ్లిన సందర్భం.. లక్షల గొంతుకలు 'జై తెలంగాణ' అని నినదించిన రోజు. ప్రతిరోజు పనికిమాలిన విమర్శలు చేసే ప్రతిపక్ష రేవంత్, బండి సంజయ్, ప్రవీణ్ కుమార్, షర్మిల తెలంగాణ ఉద్యమంలో మీ జాడ ఎక్కడ?' అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.