మంచిరెడ్డికి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ధర్యాప్తు చేయాలి: మల్ రెడ్డి రంగారెడ్డి

byసూర్య | Wed, Sep 28, 2022, 07:57 PM

ఇబ్రహీంపట్నంలో ఇందిరా గాంధీ పంచిన అసైన్డ్ భూములను మంచిరెడ్డి ఆక్రమించారని మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఆరోపించారు. రైతుల దగ్గర నయీమ్‌తో బెదిరించి భూములు గుంజుకున్నారని.. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మంచిరెడ్డి ఆస్తులు విలువ ఎంత..? ఇప్పుడెంత ఉందో చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఏ వ్యాపారం చేస్తే ఇంత డబ్బు వచ్చిందో చెప్పాలని.. ఈ వ్యవహారంలో పార్టీకి ఎలాంటి సంబంధం లేకుండా.. తక్షణమే సస్పెండ్ చేయాలని సీఎం కేసీఆర్‌ను ఆయన కోరారు.


ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంచిరెడ్డి దావూద్ ఇబ్రహీంను మించిపోయారంటూ దుయ్యబట్టారు. 2015 నుంచి హవాలా కేసులు ఉన్నాయని ఈడీ చెప్పిందని.. కిషన్ రెడ్డి ఆ డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో దర్యాప్తు చేయాలంటూ డిమాండ్ చేశారు. గతంలో తాను ఈ వ్యవహారంపై మాట్లాడితే ఎవరూ పట్టించుకోలేదని.. ఇప్పుడు ఈడీ అధికారులు తేల్చారంటూ ఆరోపించారు.


మంచిరెడ్డిని 24 గంటల్లో పార్టీ నుంచి కానీ.. ఎమ్మెల్యే పదవి నుంచి కానీ తొలగించకపోతే ముఖ్యమంత్రి కూడా ఈ స్కామ్‌లో బాధ్యులు అవుతారంటూ మల్‌రెడ్డి విమర్శించారు. ఫార్మా సీట్‌లో 8632 ఎకరాల అసైన్డ్ భూమిలో 200 ఎకరాలు కొట్టేశారని.. ఆరు నెలల కిందట మాదాపూర్‌లో మంచిరెడ్డి పట్టుబడితే వదిలేశారంటూ ఆరోపించారు. మంచిరెడ్డి స్కామ్‌లపై ఈడీ ఒక్కటే సరిపోదని, సీబీఐ, ఐటీశాఖ కూడా విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి చేసిన మనీ లాండరింగ్‌కి హవాలా డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.


Latest News
 

రేపే ఆదివారం.. చికెన్, మటన్ షాపులు బంద్ Sat, Apr 20, 2024, 04:03 PM
జనం భారీగా చిలుకూరు ఎందుకు వెళుతున్నారు? Sat, Apr 20, 2024, 03:30 PM
కొండగట్టులో ఆర్జిత సేవలు రద్దు Sat, Apr 20, 2024, 03:22 PM
ఇంద్రవెల్లి నెత్తుటి మరకలకు 43 ఏళ్లు Sat, Apr 20, 2024, 03:21 PM
నత్త నడకన సాగుతున్న పోలోని వాగు వంతెన నిర్మాణం Sat, Apr 20, 2024, 02:43 PM