byసూర్య | Sat, Sep 24, 2022, 10:30 PM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో దారుణం వెలుగుచూసింది. ఆశ్రమ పాఠశాలలో చదివే పదో తరగతి విద్యార్థినిపై ఉపాధ్యాయుడు పిచ్చయ్య లైంగిక దాడికి పాల్పడ్డాడు. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, తనకు సహకరించకపోతే చంపుతానని బెదిరించి పలుమార్లు రేప్ చేశాడు. తల్లిదండ్రులకు విషయం తెలియడంతో ఆమెను ఆసుపత్రికి తరలించగా గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.