![]() |
![]() |
byసూర్య | Sat, Sep 24, 2022, 08:08 PM
ఎన్నికల్లో డబ్బులిస్తే తీసుకోండి.. కాని ఓటు మాత్రం మీ భవిష్యత్ కోసం ఆరాట పడే పార్టీకే వేయండని షర్మిల అన్నారు. తాను ముఖ్య మంత్రి అయితే.. మొదటి సంతకం ఉద్యోగాల కల్పన మీద పెడతా. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిచేస్తా. ఇంట్లో వృద్ధులందరికీ పింఛన్ మంజూరు చేస్తానని చెప్పారు. మా పార్టీ తోనే సంక్షేమ పాలన సాధ్యమని షర్మిల పేర్కొన్నారు. ప్రజాప్రస్థాన యాత్ర శనివారం సంగారెడ్డి జిల్లా సదాశివపేటకు చేరుకుంది.