byసూర్య | Fri, Sep 23, 2022, 07:01 PM
పేద పిల్లలకు పంచొచ్చుగా' టీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడంపై ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ట్వీట్ ఆకట్టుకుంటోంది. 'నాయకులకు కృతజ్ఞతలు తెలపడంలో తప్పులేదు. కానీ, ఎంతో విలువైన పాలను ఇలా వృథా చేయడం ఎందుకు? ఇలా చేయకుండా టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పేద పిల్లలకు పాలు పంచి సంబరాలు చేసుకోవచ్చు కదా? ఈ పిచ్చిని నాయకత్వం ఆపలేదా' అని ట్వీట్ చేశారు.