byసూర్య | Fri, Sep 23, 2022, 06:53 PM
తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లు సెలవుల కారణంగా ఎల్లుండి మూతపడనున్నాయి. రేపు ఒక్క రోజు స్కూలుకు వెళ్తే... తెలంగాణలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు, ఏపీలో సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 6 వరకు దసరా సెలవులు ఉండనున్నాయి. సెప్టెంబర్ 25 ఆదివారం ఎలాగూ సెలవు కాగా.. సెలవుల అనంతరం ఏపీలో అక్టోబర్ 7 నుంచి, తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి.