byసూర్య | Fri, Sep 23, 2022, 06:45 PM
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర నిన్న ముగిసింది. దీంతో ఆయన ఈ రోజు భవానీ మాల వేసుకున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో అమ్మవారి దీక్ష స్వీకరించినట్లు సంజయ్ ట్వీట్ చేశారు. దీక్షలో ఉన్న ఫొటోలను షేర్ చేశారు.