byసూర్య | Fri, Sep 23, 2022, 04:16 PM
తెలంగాణలో 48 బీసీ గురుకుల పాఠశాలల ఏర్పాటుకు కేసీఆర్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలో ఇప్పటికే కొనసాగుతున్న గురుకులాలకు అదనంగా కొత్తగా 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలు, 33 గురుకులాలను ఏర్పాటు చేయనున్నట్లు సర్కార్ వెల్లడించింది. నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సర్కార్ తెలిపింది.