టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు

byసూర్య | Fri, Sep 23, 2022, 02:56 PM

మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటరీ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో కీసర మండలంలోని బోగారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ వార్డు సభ్యులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టిఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ మరియు మంత్రి మల్లారెడ్డి రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై రాష్ట్ర అభివృద్ధిలో పాల్పంచుకోవడానికి పార్టీలో చేరినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి అధ్వర్యంలో జరుగుతున్న రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరడం పై హర్షం వ్యక్తం చేస్తూ వారిని పార్టీలోకి కండువా కప్పి స్వాగతించారు.


Latest News
 

వీడు మామూలోడు కాదు.. 3 పెళ్లిళ్లు చేసుకుని నాలుగో అమ్మాయితో ప్రేమాయణం.. అడ్డంగా దొరికిపోయాడిలా Tue, Apr 23, 2024, 10:51 PM
నా కూతురు ఉసురు మోదీకి తగులుతుంది.. కవిత అరెస్టుపై కేసీఆర్ Tue, Apr 23, 2024, 10:44 PM
తెలంగాణలో భిన్న వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షాలు, ఐఎండీ కీలక అప్డేట్ Tue, Apr 23, 2024, 09:08 PM
యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన 16 కార్లు Tue, Apr 23, 2024, 08:59 PM
కుప్పకూలిన నిర్మాణంలోని వంతెన.. ఎంత ప్రమాదం తప్పింది Tue, Apr 23, 2024, 08:53 PM