లాభాల వాటా తేల్చని సింగరేణి

byసూర్య | Fri, Sep 23, 2022, 02:33 PM

సింగరేణి సంస్థ 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 26 వేల కోట్ల టర్నోవర్ సాధించింది. ఇందులో ఖర్చుపోగా నికర లాభాలను హైదరాబాద్ లోని సింగరేణి భవన్లో బుధవారం జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ప్రకటిస్తారని, ఆ వెంటనే లాభాల వాటాపై ప్రకటన వస్తుందని కార్మికులు ఆశగా ఎదురుచూశారు. సమావేశంలో ఇతర అంశాలపై చర్చించినా. లాభాల వాటా ప్రకటించకపోవడంతో వారు నిరాశకు లోనయ్యారు. గతేడాది ఇదే నెలలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 274. 64 కోట్ల నికర లాభం ప్రకటించి అందులో 29 శాతం వాటాగా రూ. 79. 06 కోట్లను కార్మికులకు పంపిణీ చేశారు. ఈసారి మాత్రం ప్రకటన చేయకపోవడంతో కార్మిక వర్గం సందిగ్ధంలో పడింది. కాగా, సింగరేణి నికర లాభాలు ప్రకటించని అంశంపై డైరెక్టర్ (పా) ఎస్. చంద్రశేఖర్ ను వివరణ. కోరగా, ఇంకా ఆడిట్ పూర్తి కానందునే ప్రకటించలేదని స్పష్టం చేశారు.


Latest News
 

ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయాలి Sat, Apr 20, 2024, 10:34 AM
కాంగ్రెస్ పార్టీలో చేరికలు Sat, Apr 20, 2024, 10:32 AM
గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM