byసూర్య | Fri, Sep 23, 2022, 02:32 PM
వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీపై మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన చేశారు. మరో 2 రోజుల్లో 1140 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. పీహెచ్సీల్లో 1000 మంది డాక్టర్ల భర్తీకి రాబోయే 10 రోజుల్లో ఆదేశాలిస్తామన్నారు. మరో 140 మంది మిడ్ వైఫరీలు త్వరలో అందుబాటులోకి వస్తాయన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.