అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మ, 5న దసరా పండుగ : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

byసూర్య | Fri, Sep 23, 2022, 01:36 PM

పటాన్చెరు : పటాన్చెరు డివిజన్ పరిధిలో బతుకమ్మ పండుగను అక్టోబర్ 3 వ తేదీన, దసరా పండుగను అక్టోబర్ 5వ తేదీన నిర్వహించుకోవాలని స్థానిక ప్రజా ప్రతినిధులు, పుర ప్రముఖుల సమావేశంలో నిర్ణయించారు. శుక్రవారం ఉదయం పటాన్చెరు పట్టణంలోని శ్రీ కోదండ సీతారామ స్వామి దేవాలయంలో పండుగ తేదీలపై సమావేశం నిర్వహించారు.  ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సద్దుల బతుకమ్మను  అక్టోబర్ 3వ తేదీన  పటాన్చెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై నిర్వహించుకోవాలని తెలిపారు.


దసరా పండుగను అక్టోబర్ 5వ తేదీ సాయంత్రం 05:00 గంటలకు జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ద్వజారోహన నిర్వహించి, జిహెచ్ఎంసి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో శమీ చెట్టుకు పూజలు నిర్వహించాలని నిర్వహించారు. అనంతరం సాయంత్రం ఏడు గంటలకు మైత్రి మైదానంలో రావణాసురుడి దహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ.. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో ఆనందోత్సాహాలతో పండుగలు నిర్వహించుకోవాలని కోరారు. ప్రభుత్వపరంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, పట్టణ పుర ప్రముఖులు, పురోహితులు పాల్గొన్నారు.


Latest News
 

గరుడ ప్రసాదం పంపిణీ ఆపేశాం: చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ Fri, Apr 19, 2024, 10:27 PM
చేనేత కార్మికులు ఎగిరిగంతేసే వార్త.. నిధులు విడుదల చేసిన రేవంత్ సర్కార్ Fri, Apr 19, 2024, 10:21 PM
పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్ పోస్టుల ఫలితాల విడుదల Fri, Apr 19, 2024, 09:26 PM
రాంగ్‌ రూట్‌లో వెళ్తున్నారా.. ఇక నుంచి చలాన్లే కాదు.. 3 నెలల జైలు కూడా Fri, Apr 19, 2024, 09:09 PM
వంద రోజుల్లో రైతు రుణమాఫీ చేస్తామని చెప్పలేదు: భట్టి విక్రమార్క Fri, Apr 19, 2024, 09:03 PM