byసూర్య | Fri, Sep 23, 2022, 12:33 PM
రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన బుధవారం బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం. ఈనెల 20న అర్థరాత్రి ఎయిరోపోర్సు బస్టేషన్ హకీంపేట జంక్షన్ వద్ద ఓ వాహనం ఢీకొని ఓ గుర్తు తెలియని వ్యక్తి(40) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న బొల్లారం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.