![]() |
![]() |
byసూర్య | Fri, Sep 23, 2022, 12:30 PM
సికింద్రాబాద్ లో లభ్యమైన గుర్తుతెలియని మృతదేహన్ని గాంధీ మార్పురిలో భద్రపరిచారు. గోపాలపురం ఎస్సై శివశంకర్ కథనం ప్రకారం సికింద్రాబాద్ గార్డెన్ హోటల్ సమీపంలో పుట్పాత్ పై ఈ నెల 1న మధ్యరాత్రి గుర్తుతెలియని 55 ఏళ్ల వ్యక్తి చనిపోయి ఉన్నాడని సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం కొరకు గాంధీ మార్చురికి తరలించగా, మృతుడి వివరాలు తెలియకపోవడంతో ఇప్పటి వరకు కూడా గాంధీ మార్పురిలో భద్రపరిచామని ఎస్సై చెప్పారు. మృతుని ఆచూకి తెలిస్తే వెంటనే గోపాలపురం పోలీసుల్ని ఆశ్రయించాలని పోలీసులు కోరుతున్నారు.