byసూర్య | Fri, Sep 23, 2022, 10:39 AM
వర్గల్ నవోదయ వేదికగా రీజియన్ అథ్లెటిక్ పోటీలు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతాయని ప్రిన్సిపల్ గూడూరి రమేష్ రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ముఖ్యఅతిథిగా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ హాజరై పోటీలను ప్రారంభిస్తారని, అండర్ 14, అండర్ 17, అండర్ 19 విభాగంలో బాలబాలికలకు అథ్లెటిక్స్ పోటీలు ఉంటాయని, పరుగుపందెం, లాంగ్ జంప్, హైజంప్, షాట్ పుట్, డిస్క్ త్రో, తదితర పోటీలు ఉంటాయని అన్నారు