byసూర్య | Thu, Sep 22, 2022, 11:50 PM
గాలి జనార్దన్ రెడ్డిపై నమోదైన కేసులను విచారిస్తున్న హైదరాబాద్ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో డిశ్చార్జి పిటిషన్లపై ఈ నెల 29లోగా విచారణను ముగించాలని ఆదేశించింది. ఇకపై వాయిదాలు కూడా ఇవ్వవద్దని సూచించింది. కేసు విచారణను జాప్యం చేయడానికే డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారని కూడా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.