మజ్లిస్ పార్టీని ఎందుకు అక్కున చేర్చుకుంటున్నారు: కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి

byసూర్య | Thu, Sep 22, 2022, 09:46 PM

బీజేపీని మతతత్వ పార్టీగా అభివర్ణిస్తున్న కేసీఆర్... మజ్లిస్ పార్టీని మాత్రం ఎందుకు అక్కున చేర్చుకుంటున్నారని కేంద్ర మంత్రి సాధ్వీ నిరంజన్ జ్యోతి  ప్రశ్నించారు. దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న వారు ఎవరని ఆమె ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ విజయం సాధిస్తుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆమె అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర నాలుగో దశ గురువారం పెద్ద అంబర్ పేటలో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సాధ్వీ నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. 


ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దేశంలోని కుటుంబ పార్టీలన్నీ ఏకం అవుతున్నాయన్నారు. గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన నిధులను కేసీఆర్ సర్కారు దుర్వినియోగం చేస్తోందని ఆమె ఆరోపించారు. పేదల మరుగుదొడ్ల నిర్మాణం కోసం ఇచ్చిన నిధులను కూడా కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీదారులంతా చాప చుట్టేయాల్సిందేనని ఆమె జోస్యం చెప్పారు. 


Latest News
 

యాదాద్రిలో ఎంపీ అభ్యర్థి చామల ప్రత్యేక పూజలు Wed, Apr 24, 2024, 02:38 PM
రామంతపూర్ డివిజన్ లో ఖాళీ అవుతున్న బిఆర్ఎస్ Wed, Apr 24, 2024, 02:31 PM
ఖాళీ బిందెలతో రోడ్డుపై ధర్నా Wed, Apr 24, 2024, 01:52 PM
సెకండియర్ ఫలితాల్లో నాగర్ కర్నూల్ 34 వ స్థానం Wed, Apr 24, 2024, 01:49 PM
వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు Wed, Apr 24, 2024, 01:43 PM