byసూర్య | Thu, Sep 22, 2022, 09:37 PM
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందని, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాలుగో విడత ప్రజాసంగ్రామ యాత్ర గురువారం పెద్ద అంబర్ పేటలో ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై విరుచుకుపడ్డారు.గ్రామ పంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన నిధులను కేసీఆర్ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ఆమె ఆరోపించారు.