ఆ రోజు రాత్రి 12:30 గంటల వరకు మెట్రో అదుబాటులోకి

byసూర్య | Thu, Sep 22, 2022, 08:27 PM

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న క్రికెట్ ఫ్యాన్స్ హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఓ గుడ్ న్యూస్ చెప్పారు. మ్యాచ్ ముగిసేసరికి రాత్రి దాదాపుగా 10 గంటలు దాటనుంది. ఈ సమయంలో కూడా క్రికెట్ ఫ్యాన్స్ నిశ్చింతగా ఇళ్లకు వెళ్లేందుకు నగరంలో ఆ రోజు రాత్రి 12.30 గంటల దాకా మెట్రో రైళ్లను నడపనున్నట్లు ఆయన వెల్లడించారు. క్రికెట్ ఫ్యాన్స్ రద్దీని బట్టి రైళ్ల సంఖ్యను పెంచే విషయంపై కూడా దృష్టి సారించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఎన్వీఎస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.


ఇదిలావుంటే భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భాగంగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు నగరంలోని క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల క్రికెట్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే గురువారం జింఖానా గ్రౌండ్స్ లో టికెట్ల కోసం తొక్కిసలాట కూడా చోటుచేసుకుంది. ఇక వివాదాలన్నింటినీ పక్కనపెట్టేసి 25న జరిగే మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 


Latest News
 

రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్ట్.... పోచారం శ్రీనివాస్ రెడ్డి Fri, Sep 22, 2023, 09:35 PM
త్వరలో పేదల కోసం మరిన్ని పథకాలు...కేటీఆర్ Fri, Sep 22, 2023, 09:34 PM
'ఓట్‌ ఫ్రం హోం'.. వాళ్లకు మాత్రమే ఈ ఆప్షన్ Fri, Sep 22, 2023, 08:09 PM
అమ్మాయిలను అలా టచ్ చేస్తే చాలు.. ఇక జైలు కెళ్లాల్సిందే Fri, Sep 22, 2023, 08:04 PM
ఇవే నాకు చివరి ఎన్నికలు.. మంత్రి పువ్వాడ Fri, Sep 22, 2023, 07:58 PM