byసూర్య | Thu, Sep 22, 2022, 07:40 PM
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య హైదరాబాద్ లో టీ20 మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. మూడో టీ20 మ్యాచ్ ఈ నెల 25న హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సందర్భంగా క్రికెట్ అభిమానులకు మెట్రో గుడ్ న్యూస్ చెప్పింది. మ్యాచ్ ముగిసేసరికి రాత్రి దాదాపుగా 10 గంటలు కానుండగా క్రికెట్ ఫ్యాన్స్ కోసం ఆ రోజు రాత్రి 12.30 గంటల దాకా మెట్రో రైళ్లను నడపనున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.