byసూర్య | Thu, Sep 22, 2022, 05:04 PM
తనను కలిసిన హెచ్ సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్ పై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఆలోచించి ఏర్పాట్లు చేయాలి కదా. హెచ్ సీఏ (HCA) రాజకీయాలు ప్రభుత్వంపై రుద్దితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. ప్రభుత్వమే స్టేడియాన్ని నిర్వహిస్తోంది. మీరు ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే స్టేడియం స్థల లీజు రద్దు చేస్తాం' అని హెచ్చరించారు. అటు అంతకుముందు మీడియాతో మాట్లాడిన మంత్రి.. తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.