byసూర్య | Thu, Sep 22, 2022, 05:01 PM
జింఖానా గ్రౌండ్స్ లో టీ20 మ్యాచ్ టికెట్ల విక్రయాలను అధికారులు నిలిపివేశారు. టికెట్లు అయిపోయినట్లు ప్రకటించారు. దీంతో క్యూలో నిలబడ్డవారిని బయటికి పంపించేస్తున్నారు. అయితే సాయంత్రం 7 గంటల నుంచి ఆన్లైన్ లో టికెట్లు విక్రయించనున్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు గాయపడ్డవారు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పిస్తామని అదనపు సీపీ చౌహాన్ చెప్పారు. న్యాయసలహాతో నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామన్నారు.