గ్రీన్ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటిన న్యూజిలాండ్ గాయని
byసూర్య |
Thu, Sep 22, 2022, 04:01 PM
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్లో దేశవిదేశాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొంటున్నారు. తాజాగా న్యూజిలాండ్ గాయని, నటి నటి షిర్లీ సేఠియా గ్రీన్ఇండియా చాలెంజ్లో పాలుపంచుకున్నారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా షిర్లీ సేఠియా మాట్లాడుతూ. గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణలో వాతావరణం చూస్తుంటే ఎంతో అందంగా గ్రీనరితో నిండి ఉందన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విక్టరీ వెంకటేష్, శిల్పా శెట్టి, రాజ్ కుమార్ రావు, అభిమన్యు ఈ నలుగురికి షిర్లీ సేఠియా గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమ అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ. వృక్ష వేదం పుస్తకాన్ని షిర్లీ సేఠియాకి అందజేశారు.
Latest News