గ్రీన్ఇండియా చాలెంజ్‎లో మొక్కలు నాటిన న్యూజిలాండ్ గాయని

byసూర్య | Thu, Sep 22, 2022, 04:01 PM

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ఇండియా చాలెంజ్‎లో దేశవిదేశాల ప్రతినిధులు, ప్రముఖులు పాల్గొంటున్నారు. తాజాగా న్యూజిలాండ్ గాయని, నటి నటి షిర్లీ సేఠియా గ్రీన్ఇండియా చాలెంజ్‎లో పాలుపంచుకున్నారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్‎లో ఆమె మొక్కలు నాటారు. ఈ సందర్భంగా షిర్లీ సేఠియా మాట్లాడుతూ. గ్రీన్ ఇండియా చాలెంజ్‎లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. తెలంగాణలో వాతావరణం చూస్తుంటే ఎంతో అందంగా గ్రీనరితో నిండి ఉందన్నారు. ఇంతటి గొప్ప అవకాశం కల్పించిన ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్‎కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విక్టరీ వెంకటేష్, శిల్పా శెట్టి, రాజ్ కుమార్ రావు, అభిమన్యు ఈ నలుగురికి షిర్లీ సేఠియా గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమ అనంతరం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ. వృక్ష వేదం పుస్తకాన్ని షిర్లీ సేఠియాకి అందజేశారు.

Latest News
 

హనుమాన్ విగ్రహానికి పద్మారావు గౌడ్ ప్రత్యేక పూజలు Tue, Apr 23, 2024, 04:22 PM
నల్గొండలో కుటుంబ పాలన నడుస్తుంది: శానంపూడి సైదిరెడ్డి Tue, Apr 23, 2024, 04:19 PM
రోడ్డు ప్రమాదంలో యువకుడు స్పాట్ డెడ్ Tue, Apr 23, 2024, 03:37 PM
24న మోటార్ సైకిల్ల వేలం పాట Tue, Apr 23, 2024, 03:14 PM
అమ్మవారి ఆశీస్సులు ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలి Tue, Apr 23, 2024, 01:53 PM