byసూర్య | Thu, Sep 22, 2022, 02:18 PM
బిజెపి నాయకులు, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ప్రజాగోస- బిజెపి భరోసా యాత్రలో భాగంగా రెండవ రోజు జైనథ్ మండలంలో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. ఇందులో భాగంగానే మండలంలోని ఆనంద్ పూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, రాష్ట్ర నాయకురాలు సుహాసిని రెడ్డి తో కలిసి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన పలువురు యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున బీజేపీ పార్టీలో చేరారు. వారికి ఈటెల రాజేందర్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.ముందుగా గ్రామానికి వచ్చిన ఈటెల రాజేందర్ గ్రామస్తులు, బిజెపి నాయకులు డప్పు చప్పుళ్లతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కట్కం రాందాస్, బిజెపి నాయకులు ఆదినాథ్, దినేష్ మాటోలియా, లోక ప్రవీణ్ రెడ్డి, మయూరి చంద్ర, విజయ్, పాయల్ శరత్, నాయకురాళ్లు ధోనే జ్యోతి, గంగమణి, పలువురు కార్యకర్తలు, గ్రామస్థులు పాల్గొన్నారు.