byసూర్య | Thu, Sep 22, 2022, 02:17 PM
ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ను ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పరామర్శించారు. ఇటీవల ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ మృతి చెందడంతో విషయం తెలుసుకున్న గంప గోవర్ధన్ గురువారం ఎమ్మెల్యే స్వగ్రామమైన దీపాయి గూడ గ్రామానికి వెళ్లి భోజమ్మ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రామన్న తో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ అడ్డి భోజ రెడ్డి పూజ, రెడ్డి టిఆర్ఎస్ పార్టీ నాయకులు సజీదొద్ధిన్, జోగు మహేందర్, నారాయణ, సాయిని రవి కుమార్, బలశంకర్ కృష్ణ తదితరులు ఉన్నారు