అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టివేత
byసూర్య |
Thu, Sep 22, 2022, 12:36 PM
అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఎయిర్ పోర్టు లో కస్టమ్స్ అధికారులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ ఇండియా - 952 విమానంలో దుబాయ్ నుంచి వచ్చిన మహిళ కదలి కలను అనుమానించిన అధికారులు ఆమెను క్షుణ్నంగా తనిఖీ చేశారు. తన లోదుస్తుల్లో దాచుకుని తీసుకొచ్చిన 300 గ్రాముల బరువు కలిగిన మూడు బంగారు బిస్కెట్లు బయటికి తీశారు. బంగారం విలువ 15. 45 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితురాలిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Latest News