byసూర్య | Sat, Aug 20, 2022, 10:28 AM
జగిత్యాల జిల్లాలోని కొనాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 35లక్షల12వేల957/- రూపాయల ఋణ మాఫీ నిధులు మంజూరు చేశారని, ఋణ మాఫీ నిధుల మంజూరుకు కృషి చేసిన ఏమ్మెల్యే సంజయ్ కుమార్ కి సహకార సంఘం, రైతుల పక్షాన జగిత్యాల ఎమ్మేల్యే క్వార్టర్స్ లో కలిసి, శాలువా తో సత్కరించి ప్యాక్స్ ఛైర్మెన్ గురునాథం మల్లారెడ్డి, డైరెక్టర్ లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శేకర్ గౌడ్, కోనపూర్ గ్రామ శాఖ అధ్యక్షులు ఏనుగుల మల్లేష్ , మర్రిపెల్లి రాజేశం కొలపాక లక్ష్మి రాజాం, నరేష్ , రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.