byసూర్య | Sat, Aug 20, 2022, 10:03 AM
యాదాద్రి జిల్లా సీపీఐ 3వ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ ఆలేరులో శుక్రవారం సాయంత్రం ఆ పార్టీ నాయకులు , కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లాకేంద్రమైన భువనగిరి పట్టణంలో ఈనెల 20, 21 తేదీలలో జిల్లామహాసభలు జరుగుతాయని ఆపార్టీ జిల్లా కమిటీ సభ్యుడు చెక్క వెంకటేష్ చెప్పారు. పోతు ప్రవీణ్, పొన్నెబోయిన రవి, గొట్టిపాముల శ్రీను తదితరులు పాల్గొన్నారు.